IND vs WI | ఇప్పటికే వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. టీ20లోనూ అదే రిపీట్ చేసింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన నామమాత్రపు టీ20లో ఘన విజయం సాధించింది. విస్టిండీస్ను 18 పరుగుల తేడాతో ఓడించి క్లీన్స్వీప్ చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. నాలుగు పరుగులకే రుతురాజ్ గైక్వాడ్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (25), ఇషాన్ కిషన్ ( 34) పరుగులతో ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ (4) కూడా ఔటవ్వడంతో పరుగుల వేటలో వెనుకపడిపోయింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (65) టీమిండియాను ఆదుకున్నాడు. ఏడు సిక్సులతో చెలరేగి ఆడాడు. వెంకటేశ్ అయ్యర్ (35)తో కలిసి భారీ స్కోర్ అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఆ తర్వాత 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. తొలి ఓవర్ నుంచే తడబడింది. మయేర్స్ (6), షై హోప్ (8) తక్కువ పరుగులకే ఔటయ్యారు. అయితే నికోలస్ పూరన్ (61) చెలరేగి ఆడాడు. రోవ్మన్ పావెల్ (25), రొమారియా షెఫర్డ్ (29) ఫర్వాలేదనిపించారు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కీరన్ పోలార్డ్ (5), జేసన్ హోల్డర్ (2) , రోస్టన్ ఛేజ్ (12), అలెన్ ( 5), డ్రెక్స్ (4) పరుగుల వేటలో విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగుల వద్దనే ఆగిపోయింది. దీంతో టీ20 సిరీస్ క్లీన్స్వీప్ కూడా టీమిండియా ఖాతాలో చేరింది.