కోల్కతా: గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో.. కోల్కతా బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) చివరి ఓవర్లో వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ను వేసిన యశ్ దయాల్(Yash Dayal)ను .. రింకూ సింగ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బౌలర్ దయాల్కు రింకూ మెసేజ్ చేశాడు. నిజానికి ఈ ఇన్నింగ్స్తో రింకూ హీరో అయ్యాడు.. కానీ బౌలర్ యశ్ మాత్రం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మ్యాచ్ ముగిశాక తలెత్తుకునే స్థితిలో కూడా లేకండా పోయాడు.
Chin up, lad. Just a hard day at the office, happens to the best of players in cricket. You’re a champion, Yash, and you’re gonna come back strong 💜🫂@gujarat_titans pic.twitter.com/M0aOQEtlsx
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
యూపీ దేశవాళీ క్రికెట్ లో ఇద్దరూ కలిసి ఆడారు. డ్రెస్సింగ్ రూమ్ను దయాల్తో గతంలో రింకూ షేర్ చేసుకున్నాడు. అయితే ఐపీఎల్లో వీరబాదుడు వల్ల కృంగిపోయిన దయాల్ను ఓదార్చేందుకు టెక్ట్స్ చేసినట్లు రింకూ చెప్పాడు. క్రికెట్లో ఇది సహజమని, గత ఏడాది అద్భుతంగా బౌలింగ్ చేశావని, ఆ బౌలర్ను మోటివేట్ చేసేందుకు ప్రయత్నించినట్లు రింకూ తెలిపాడు.
కేకేఆర్ జట్టు కూడా బౌలర్ యశ్కు మనోధైర్యాన్ని పంచే ప్రయత్నం చేసింది. దయాల్కు ఓ స్వీట్ మెసేజ్ చేసింది. తల ఎత్తుకోవాలని, ఆఫీసులో ఇదో కష్టమైన రోజు అనుకోవాలని, క్రికెట్లో ఉత్తమ ప్లేయర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, నువ్వు చాంపియన్వి అని, యశ్ నువ్వు మళ్లీ అద్భుతంగా రాణిస్తావని కేకేఆర్ జట్టు తన ట్వీట్లో అభిప్రాయపడింది.