అబుధాబి: టీ20 ప్రపంచకప్లో న్యూజిల్యాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్కు వేదిక సిద్ధమైంది. అబుధాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్.. టీమిండియా సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్పై ఫోకస్ పెట్టారు. ఈ మ్యాచ్లో కివీస్ను ఆఫ్ఘనిస్ఘాన్ ఓడిస్తే భారత్కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. లేదంటే తన చివరి మ్యాచ్లో నమీబియాపై టీమిండియా భారీ విజయం సాధించినా ఉపయోగం ఉండదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ జట్టు ఆడిన చివరి మ్యాచ్కు దూరమైన స్టార్ ప్లేయర్ ముజీబ్ మళ్లీ జట్టులో చేరినట్లు నబీ చెప్పాడు. న్యూజిల్యాండ్ జట్టు మాత్రం తమ కూర్పులో ఎలాంటి మార్పులూ లేకుండానే బరిలో దిగుతోంది.
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నె, టిమ్ సౌథీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
ఆఫ్ఘనిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మొహమ్మద్ షెహజాద్, రహ్మనుల్లా గుర్బాజ్, నజిబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్