మహబూబ్నగర్టౌన్, జనవరి 2: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి అండర్-17 బాల బాలికల హ్యాండ్బాల్ టోర్నీ ముగిసింది. మంగళవారం జరిగిన బాలుర ఫైనల్లో ఆదిలాబాద్ 20-17తో మహబూబ్నగర్పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన ఆదిలాబాద్..పాలమూరు టీమ్తో ఆఖరి వరకు హోరాహోరీగా తలపడింది.
మరోవైపు బాలికల తుది పోరులో వరంగల్ 9-1తో ఆదిలాబాద్పై గెలిచి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో వరంగల్, బాలికల కేటగిరీలో మహబూబ్నగర్ జట్లు మూడో స్థానంలో నిలిచాయి. విజేతలకు జిల్లా డీఈవో రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు ప్రదానం చేశారు.