హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): అంతర్ జిల్లా ల రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఏసీబీ హోంగార్డు టి.ముఖేశ్సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ పోటీల్లో 90+ కేజీల ఫ్రీైస్టెల్ విభాగంలో బరిలోకి దిగిన ముఖేశ్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ మంగళవారం తన కార్యాలయంలో ముఖేశ్సింగ్ను అభినందించి నగదు బహుమతి అందజేశారు.