హైదరాబాద్, ఆట ప్రతినిధి: పుణె వేదికగా జరిగిన 3వ జాతీయ ఫిన్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు పతక జోరు కనబరిచారు. టోర్నీలో రాష్ట్ర స్విమ్మర్లు 16 స్వర్ణాలు సహా 12 రజతాలు, 7 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్గా బెంగాల్(443), కేరళ(175) తర్వాత తెలంగాణ 158 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. టోర్నీలో లిఖిత జాతీయ రికార్డు నెలకొల్పగా, 50మీటర్ల విభాగంలో భువాస్ పాతూరి మూడు నేషనల్ మీట్ రికార్డులను కొల్లగొట్టాడు. మరోవైపు టోర్నీ మొత్తమ్మీద అశ్వత్ మూడు స్వర్ణాలు సహా రెండు రజతాలు దక్కించుకోగా, సన్నీ మూడు పసిడి పతకాలు, ఒక కాంస్యం, అర్జున్కు మూడు స్వర్ణాలు, ఒక రజతం ఖాతాలో వేసుకున్నారు.