హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత ఐస్ స్కేటింగ్ జట్టుకు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ కోచ్గా ఎంపికయ్యాడు. సింగపూర్ వేదికగా వచ్చే నెల 1, 2 తేదీల్లో జరిగే ఆసియా షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్న భారత టీమ్కు ఖాదీర్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
అయితే ఆసియా టోర్నీకి సన్నాహకంగా మనీలా(ఫిలిప్పిన్స్) వేదికగా ఈ నెల 25 నుంచి 30 వరకు జాతీయ జట్టు ప్లేయర్లు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. మన స్కేటర్లు చాలా ప్రతిభావంతులని ఇటీవల జరిగిన ఎస్ఈఏ ట్రోఫీలో జట్టును రన్నరప్గా నిలుపడంలో కీలకంగా వ్యవహరించారని ఖాదీర్ పేర్కొన్నాడు.