హైదరాబాద్, ఆట ప్రతినిధి: కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ ఆనకట్ట వద్ద జరిగిన మైసూర్ నేషనల్స్లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. టోర్నీలో తమకు తిరుగులేదన్న రీతిలో మన సెయిలర్లు ఆరు స్వర్ణాలు సహా నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలతో మెరిశారు. మిక్స్డ్ అండ్ ఓపెన్ క్యాటగిరీలో లావేటి ధరణి, తనూజ రెండు స్వర్ణాలు, రెండు రజత పతకాలు దక్కించుకున్నారు. 420 మిక్స్డ్ అండ్ ఓపెన్ క్లాస్ విభాగంలో ధరణి, వడ్ల మల్లేశ్ ద్వయం మొత్తం 11 రేసుల్లో తొమ్మిదింటిలో విజయం సాధించింది. మరోవైపు జూనియర్ మిక్స్డ్ విభాగంలో తనూజ, శ్రవణ్ జోడీ రజతం సొంతం చేసుకోగా, ఓపెన్ క్లాస్లో వీరిద్దరు స్వర్ణం, రజతం ఖాతాలో వేసుకున్నారు. .