ఉప్పల్: ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయి. దీంతో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఇబ్బందులు తొలిగాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. అభిమానులు నిరుత్సాహం చెందవద్దన్న కారణంతో బకాయిల చెల్లింపులకు ఒక రోజు అదనపు సమయం ఇచ్చినట్లు విద్యుత్శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అంతకుముందు స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్శాఖ అధికారులు గురువారం స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. గత నెల 20న ఇచ్చిన నోటీసుల ప్రకారం రూ.1.67 కోట్లు బకాయిలు గడువులోగా కట్టనందుకు విద్యుత్శాఖ ఈ చర్యకు పూనుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బకాయిలు రాబట్టుకోవడం కోసం కరెంట్ ఆపేసినట్లు పేర్కొంది. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియంలో చీకట్లు అలుముకున్నాయి. జనరేటర్ల సహాయంతో స్టేడియంలో కరెంట్ సరఫరా చేశారు. ఒకానొక దశలో అసలు మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానాలు చెలరేగాయి.