మెదక్ మున్సిపాలిటీ: నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్ పోటీలు శనివారం మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ.. ‘ఈ పోటీల్లో 70, 80 ఏండ్లకు పైబడిన వృద్ధులు పాల్గొనడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. వీరిని ఆదర్శంగా తీసుకొని యువత క్రీడల్లో రాణించాలి. సీఎం కేసీఆర్ విద్యతో పాటు క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషిచేస్తున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ట్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్రెడ్డి, కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.