ICC : భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కొత పడింది. కారణం ఏంటంటే..? ఆ మ్యాచ్లో నిర్ణీత సమయానికి భారత్ 3 ఓవర్లు వెనకపడింది. ఈ విషయాన్ని మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీకి నివేదించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించాడు. దాంతో భారత జట్టు మ్యాచ్ ఫీజులో రూ.39.6 లక్షలను ఐసీసీ కోత విధించింది. ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 60 శాతం ఫైన్ పడనుంది.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో భారత్ గెలిచింది. 12 పరుగుల తేడాతో కివీస్ను ఓడించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో ఇండియా 50 ఓవర్లకు 349 రన్స్ చేసింది. ఛేజింగ్లో న్యూజిలాండ్ 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ, మైఖేల్ బ్రేస్వెల్ సుడిగాలి ఇన్నింగ్స్తో సెంచరీ బాదాడు. దాదాపు జట్టును గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్ రెండో బంతికి అతను ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో భారత్ 12 రన్స్తో విజయం నమోదు చేసింది. రెండో వన్డే జనవరి 21న రాయ్పూర్లో జరగనుంది.