జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న 37వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు అదరగొట్టారు. శనివారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు చెందిన అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా ఒక రజతంతో మెరిశారు. బాలుర అండర్-16 100మీటర్ల రేసును 11.21 సెకన్లలో ముగించిన సంగినేని హర్షవర్ధన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇదే విభాగంలో నిశోక్, ఆరోన్ అమిత్ వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బాలుర అండర్-16 300మీటర్ల విభాగంలో షేక్ అజారుద్దీన్ 35.06సెకన్ల టైమింగ్తో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. బాలికల అండర్-18 100మీటర్ల కేటగిరీలో సాయిసంగీత రజతం సొంతం చేసుకుంది. పతక విజేతలను అథ్లెటిక్స్ కోచ్ ఆర్కే బోస్ అభినందించారు.