మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా 32వ సబ్జూనియర్ అండర్-16 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు పోటీలు హోరాహోరీగా సాగాయి.
బాలికల విభాగంలో మంచిర్యాల జట్టు 52-16తో మహబూబ్నగర్పై ఘన విజయం సాధించగా, నల్లగొండ 64-12తో మహబూబాబాద్పై హనుమకొండ 41-19తో నిజామాబాద్పై గెలిచి ముందంజ వేశాయి. ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే దివాకర్రావు అతిథిగా హాజరయ్యారు.