న్యూఢిల్లీ: బ్రెజిల్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్ పతకాల మోత మోగించింది. బ్రెజిల్ వేదికగా జరిగిన టోర్నీలో భారత పారా బ్యాడ్మింటన్ జట్టు 28 పతకాలు (8 స్వర్ణం, 7 రజతం, 13 కాంస్యం) కొల్లగొట్టింది. ఆదివారం ఆఖరి రోజు భారత స్టార్ షట్లర్లు తరుణ్ ధిల్లాన్, సుకాంత్ కదమ్, ప్రమోద్ భగత్.. స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు.
ఎస్ఎల్ 4 కేటగిరి ఫైనల్లో భారత షట్లర్ తరుణ్ ధిల్లాన్ 21-17, 20-22, 21-18తో ప్రపంచ మూడో నంబర్ సుకాంత్ కదమ్ను ఓడించాడు. తరుణ్ స్వర్ణం, సుకాంత్ రజతం పొందారు. ప్రపంచ నంబర్వన్ ప్రమోద్ భగత్ రెండు కాంస్యాలతో సరిపుచ్చుకున్నాడు.