హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక ఆసియా పారాగేమ్స్లో యువ ఆర్చర్ శీతల్దేవి సంచలనం సృష్టించింది. రెండు చేతులు లేకపోయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఒకే పారా ఆసియా గేమ్స్లో రెండు స్వర్ణాలు సాధించిన తొలి భారత ఆర్చర్గా శీతల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో శీతల్ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఈ 16 ఏండ్ల యువ ఆర్చర్ 144-142తో అలిమ్నుర్ సయ్యేదా(సింగపూర్)పై అద్భుత విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ మహిళల డబుల్స్ కాంపౌండ్ ఈవెంట్లో శీతల్ రజతాన్ని ఖాతాలో వేసుకుంది. జమ్ముకశ్మీర్కు చెందిన శీతల్కు పుట్టుకతోనే ఫొకోమిలియా సిండ్రోమ్ ఉంది. చేతులు లేకుండా పెరిగిన శీతల్ను భారత ఆర్మీ చేరదీసి శిక్షణ అందించింది. ఇదిలా ఉంటే శనివారంతో ముగియనున్న పారా ఆసియా గేమ్స్లో భారత్ ప్రస్తుతం 99 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతున్నది.