Under-19 World Cup : భారత మహిళల క్రికెట్ జట్టు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను లెగ్ స్పిన్నర్ పర్శవి చోప్రా దెబ్బ తీసింది. మూడు వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో కివీస్ 9 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 14.2 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. షెఫాలీ వర్మ 10, సౌమ్యా తివారీ 22 పరుగులకే ఔట్ అయ్యారు. మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 61 నాటౌట్, జి. త్రిష 5 నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించారు. టీమిండియా ఫైనల్లో రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది. ఫైనల్ బెర్తు కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. పర్శవి చోప్రా 4 ఓవర్లలో 20 పరుగలిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పర్షవి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది.
తొలిసారి నిర్వహిస్తున్న అండర్ -19 వరల్డ్ కప్లో షెఫాలీ వర్మ కెప్టెన్సీలోని టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పిస్తే అన్ని మ్యాచుల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్ చేరి చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది.