ముంబై: సరిగ్గా 19 ఏండ్ల క్రితం భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా లలిత్ మోదీ..టీమ్ఇండియా క్రికెటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. మెగాటోర్నీలో ఎవరైనా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు లేదా ఆరు వికెట్లు తీస్తే వారికి ఖరీదైన పోర్షె కారు బహుమతి ఇస్తానని మాటిచ్చాడు.
మోదీ ఆఫర్ను మనుసులో పెట్టుకున్న యువీ..ఇంగ్లండ్తో పోరులో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి కొత్త చరిత్ర లిఖించాడు. బ్రాడ్ను ఉతికి ఆరేస్తూ యువీ ఆరు బంతులను సిక్స్లుగా మలిచాడు. మ్యాచ్ అయిపోగానే మోదీని కలిసిన యువీ ఏమైంది తన కారు అంటూ ప్రశ్నించాడట.
ఈ విషయాన్ని తాజాగా ఓ పాడ్కాస్ట్లో మోదీ పంచుకున్నాడు. ‘టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఒక రోజు టీమ్ఇండియా డ్రెస్సింగ్రూమ్కు వెళ్లినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆఫర్ ఇచ్చాను. ఎవరైతే ఆరు సిక్స్లు లేదా ఆరు వికెట్లు తీస్తే పోర్షె కారు బహుమతి ఇస్తానన్నాను.
ఇంగ్లండ్పై ఆ ఫీట్ సాధించిన యువీకి పోర్షె బదులుగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్గా ఇచ్చాను. అప్పట్లో పోర్షె కారు భారత్కు దిగుమతి కావాలంటే చాలా రోజులు పట్టేది. అన్ని రోజులు ఆగలేను బీఎండబ్ల్యూ అయినా ఓకే అంటూ యువీ చెప్పడంతో ఇచ్చిన మాట ప్రకారం కారు కొనిచ్చాను. అందుకు ప్రతిగా ఆరు సిక్స్లు కొట్టిన బ్యాటు యువీ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇప్పుడు అది 50 పోర్షె కార్లతో సమానం’ అంటూ మోదీ వివరించాడు.