Ayesha Naseem : పాకిస్థాన్ మహిళా జట్టు(Pakistan Women Team) సభ్యురాలు అయేషా నసీమ్(Ayesha Naseem) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్ల వయసులోనే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఈరోజు ప్రకటించింది. దేశ విదేశాల్లో ఈవయసులోనే తమని తాము నిరూపించుకునేందుకు ఎక్కువ మంది తహతహలాడుతుంటే.. అయేషా మాత్రం భిన్నమైన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిన్న వయసులోనే ఆటకు వీడ్కోలు పలకడానికి ఆమె చెప్పిన కారణం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో(Social Media) పెద్ద చర్చకు దారి తీసింది.
‘ఇస్లాం మత(Islam Religion) ఆచారాలను తూచా తప్పకుండా పాటించాలనుకుంటున్నా. అందుకే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా’ అని అయేషా వెల్లడించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్(Osama bin Laden)ను అమెరికా దళాలు తుదుముట్టించిన అబోటాబాద్(Abotabad)లో 2004లో ఆమె జన్మించింది. 15 ఏండ్ల వయసులోనే నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకొని జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది.
అయేషా నసీమ్
2021లో వెస్టిండీస్తో పోరులో వన్డే అరంగేట్రం చేసిన అయేషా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్ ఆడింది. ఇక పొట్టి ఫార్మాట్లో అంతకుముందు ఏడాది (2020) థాయ్లాండ్పై తొలి మ్యాచ్ ఆడింది.ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐర్లాండ్తో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడింది. 4 వన్డేలు, 30 టీ20 మ్యాచ్లు ఆడిన అయేషా.. వన్డేల్లో 33 పరుగులు, పొట్టి ఫార్మాట్లో 369 రన్స్ చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్లో సైతం ఆమె ఆడింది.