MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మరోసారి వార్తల్లో నిలిచాడు. 11ఏళ్ల క్రితం అతడి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ధోనీ ఇండియా సిమెంట్స్(India Cements) మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యాడు. అందుకుగానూ నెలకు 43 వేల జీతం ఇస్తున్నట్టు ఆ లెటర్లో ఉంది. ఫిక్స్డ్ అలవెన్స్లు నెలకు రూ.21,790, స్పెషల్ అలవెన్సు నెలకు 60,000 ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు కొందరు ‘జీతం కంటే స్పెషల్ అలవెన్స్ ఎక్కువ ఉంది’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
భారత జట్టు విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. అతని హయాంలోనే టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకుంది. మిస్టర్ కూల్ కెప్టెన్ భారత్కు 2007లో పొట్టి ప్రపంచకప్, సొంత గడ్డపై 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లోనూ మహీ కెప్టెన్గా సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) జట్టును ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. పదహారో సీజన్లో ఏమాత్రం అనుభవం లేని ఆటగాళ్లతో ధోనీ అద్భుతం చేశాడు. జట్టును ఫైనల్కు తీసకెళ్లాడు. ఫైనల్లో రవీంద్ర జడేజా(11 నాటౌట్) సంచలన ఆటతో చెన్నైని గెలిపించాడు.