దుబాయ్ : వచ్చే నెలలో లండన్లో జరుగనున్న డబ్ల్యూటీసీ(వరల్ కప్ టెస్టు చాంపియన్షిప్) ఫైనల్ విజేతకు 1.6 మిలియన్ డాలర్లు(రూ.13.2 కోట్లు) అందజేయనున్నారు. రన్నరప్కు 800మిలియన్ డాలర్లు(రూ.6.6 కోట్లు) దక్కుతాయని ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. టీమ్ ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7-11 తేదీలలో లండన్లోని ఓవల్ మైదానంలో జరుగనున్నది. జూన్ 12ను రిజర్వ్ డేగా నిర్ణయించారు. నగదు బహుమతితోపాటు విజేతకు చాంపియన్షిప్ గదను కూడా అందజేస్తారు.
కాగా టెస్టు చాంపియన్షిప్లో తతిమా జట్లకు కూడా నగదు బహుమతిని పంపిణీ చేయనున్నారు. మూడో స్థానం సౌతాఫ్రికాకు 450,000 డాలర్లు (రూ.3.7 కోట్లు), నాలుగో స్థానం ఇంగ్లండ్కు 350,000 డాలర్లు (రూ.2.8 కోట్లు), ఐదో స్థానం శ్రీలంకకు 200,000 డాలర్లు (రూ.1.65 కోట్లు), తక్కిన జట్లు న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్& ఒక్కొక్కరికి 100,000 డాలర్లు(రూ.82.5 లక్షలు) దక్కనున్నాయి.