ఇస్లామాబాద్: పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ హస్నైన్పై నిషేధం పడింది. గత నెల బిగ్బాష్ లీగ్ సందర్భంగా హస్నైన్ బౌలింగ్పై ఫిర్యాదులు అందగా.. వాటిని సమీక్షించిన ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్లో అతడి బౌలింగ్పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ‘హస్నైన్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అనర్హుడు’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. పాక్ జాతీయ జట్టు తరఫున 8 వన్డేలు, 18 టీ20లు ఆడిన హస్నైన్ ఓవరాల్గా 29 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పాకిస్థాన్లో ప్రాక్టీస్ చేస్తున్న హస్నైన్.. త్వరలోనే తన బౌలింగ్ యాక్షన్లో మార్పులు చేసుకొని తిరిగి టెస్టుకు హాజరవ్వాలనుకుంటున్నట్లు పీసీబీ వెల్లడించింది.