IPL | న్యూఢిల్లీ: ఐపీఎల్-17వ సీజన్ను ఓటమితో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్న్యూస్. నిఖార్సైన బౌలర్లు లేక పంజాబ్ కింగ్స్తో రెండ్రోజుల క్రితం ముగిసిన మ్యాచ్లో 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆ జట్టుకు సఫారీ స్టార్ పేసర్ ఆన్రిచ్ నోకియా శుభవార్త చెప్పాడు. సోమవారం అతడు ఢిల్లీ క్యాంప్లో జాయిన్ అయ్యాడు. సోమవారం అతడు క్యాపిటల్స్ సభ్యులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నాడు. ఈ సఫారీ పేసు గుర్రం.. ఈ నెల 28న రాజస్థాన్తో జరుగబోయే మ్యాచ్లో ఆడనున్నాడు.