బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు గెలుపు కరువైంది. బుధవారం జరిగిన తమ నాలుగో మ్యాచ్లో టైటాన్స్ 36-38 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది. తలైవాస్ టీమ్లో రైడర్ నరేందర్ పది పాయింట్లతో విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
టైటాన్స్ టీమ్లో కెప్టెన్ పవన్ శెరావత్ (7), రాబిన్ చౌదరీ (7), సంజీవి (6) రాణించినా లాభం లేకపోయింది.