ముంబై: టోర్నీ ఆసాంతం రాణించిన జైపూర్ పింక్ పాంథర్స్.. ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) టైటిల్ చేజిక్కించుకుంది. ఆదివారం అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన పీకేఎల్ 9వ సీజన్ తుదిపోరులో జైపూర్ 33-29తో పుణెరీ పల్టన్పై విజయం సాధించింది. జైపూర్ తరఫున అర్జున్, సునిల్, అజిత్ తలా ఆరు పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సమరంలో ఆరంభం నుంచి స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన జైపూర్.. విజేతగా నిలువగా.. తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన పుణెరీ పల్టన్ రన్నరప్తో సరిపెట్టుకుంది.