పంచలింగాల వద్ద కోటి విలువైన ఆభరణాలు సీజ్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బస్సులో అక్రమంగా తరలిస్తున్న వజ్రాలు, ముత్యాల బంగారు ఆభరణాలను ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద పోలీసులు బుధవారం పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వీటిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు 518 గ్రాములు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు 579 గ్రాములు, రూ.60.54 లక్షల విలువైన వజ్రాలు, 27 వేల విలువైన ముత్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.04 కోట్లు ఉంటుందని వెల్లడించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.