రాయ్పూర్: నక్సలిజాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి నక్సలిజానికి ముగింపు పలుకుతామన్నారు. శనివారం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలపై నక్సలైట్లు మెరుపుదాడికి దిగి 22 మందిని చంపేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బగేల్తోపాటు భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా షా మీడియాతో మాట్లాడుతూ.. ‘నక్సలిజంపై పోరాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నక్సలిజాన్ని తుదముట్టిస్తాం’ అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా నక్సలిజంపై చేస్తున్న పోరాటం నిర్ణయాత్మకమైన మలుపు తిరిగిందనీ, ప్రస్తుతం చోటుచేసుకున్న దురదృష్టకర ఘటన ఈ పోరాటాన్ని మరో రెండడుగులు ముందుకు తీసుకెళ్లిందని అమిత్ షా చెప్పారు.
వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో దేశం వెనుకడుగు వేయబోదని, ఈ దాడి భద్రతాబలగాల్లో మరింత అంకితభావాన్ని పెంచుతుందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నందువల్లే ఈ దాడి జరిగినట్టు మంత్రి అభిప్రాయం వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
మధుమేహం ఉన్నవారు కార్న్ఫ్లేక్స్ తినొచ్చా..?