చర్లపల్లి, మార్చి 10 : మాజీ సైనికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో బుధవారం నిర్వహించిన మాజీ సైనిక గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరంవారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నికల్లో మాజీ సైనిక గ్రాడ్యుయేట్స్ సమిష్టిగా వాణీదేవికి ఓటు వేసి చట్టసభలకు పంపించాలని ఆయన సూచించారు.
అనంతరం జైజవాన్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుమల్లయ్య ఆధ్వర్యంలో ఎంపీ లక్ష్మీకాంతారావును కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎంఏ.కరీం, సంయుక్త కార్యదర్శి ప్రసాద్రావు, కోశాధికారి పోల్రాజు, సభ్యులు ఎస్ఎం.సహేబ్, ఏలీషా, నారాయణ, సమ్సన్, రంగాస్వామి, ఎస్ఎస్ఎన్.రాజు, సలహాదారులు మల్లికార్జున్రావు, జేవీ.రమణ, టీఆర్ఎస్ యూత్ నాయకుడు శ్రీనివాస్గౌడ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.