WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని వాట్సాప్కు 2.78 బిలియన్ల యూజన్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో ఆల్రెడీ ఉన్న ఫీచర్స్లో మార్పులు చేస్తూ వస్తున్నది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ని పరిచయం చేయబోతున్నది. ‘క్లియర్ ఆన్ రీడ్ మెసేజ్ కౌంట్’ పేరుతో ఫీచర్ని అందుబాటులోకి తెస్తున్నది.
వాట్సాప్లో గ్రూపుల సంఖ్య పెరుగుతున్నది. అదే సమయంలో అందులో వస్తున్న మెసేజ్ల సంఖ్య కూడా విపరీతంగా ఉంటుంది. కుప్పలు తెప్పలుగా గ్రూపుల్లో వస్తున్న సందేశాలను చూసేందుకు యూజర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో ఫోన్ సైతం ప్రభావితమవుతుంది. ఈ క్రమంలో యూజర్లు చదవని మెసేజ్లను ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా క్లియర్ అయ్యేలా.. ‘క్లియర్ అండ్ రీడ్ మెసేజ్ కౌంట్’ పేరుతో ఫీచర్ను తీసుకువస్తున్నది.
దాంతో ‘అన్ రీడ్ మెసేజ్లను కౌంట్ చాట్లో చూపించదు. వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్లో ఆప్షన్ ఇవ్వనున్నది. యూజర్లు తమకు ఇష్టం వచ్చిన విధంగా దాన్ని ఎనేబుల్, డిజేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మెసేజ్లు వస్తుండే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ అప్డేట్ ట్రాకింగ్ ప్లాట్ఫారమ్ WABetaInfo పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.11.13 బీటా వర్షెన్లో కనిపించిందని పేర్కొంది.
త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా.. వాట్సాప్ ఇటీవల యాప్లో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ కలర్ లోగోను పైకి జరిపి.. బ్యాక్ గ్రౌండ్ని తెలుపురంగులోకి మార్చేంది. అంతేకాకుండా అప్డేట్ ఆప్షన్ని సైతం తీసుకువచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ మరికొన్ని ఫీచర్లపై సైతం పని చేస్తుందని వాబీఇన్ఫో పేర్కొంది.