కొందరికి స్మార్ట్ఫోనే ప్రపంచం. అది లేకుంటే ముద్ద కూడా దిగదు. పక్కన ఎవరు ఉన్నా లేకున్నా.. ఒంటరిగా ఉన్నా.. పది మందిలో ఉన్నా.. ఖచ్చితంగా స్మార్ట్ఫోన్ మాత్రం చేతుల్లో ఉండాల్సిందే. అందుకే.. రోజురోజుకూ స్మార్ట్ఫోన్ సేల్స్ పెరుగుతున్నాయి. హైఎండ్ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.
కొందరికి తమ స్మార్ట్ఫోన్లో బెస్ట్ ఫీచర్స్ ఉండాలనుకుంటారు. ధర ఎంతైనా పర్లేదు కానీ.. బెస్ట్ ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటారు. అటువంటి వాళ్లకు ఈ ఫోన్ బెస్ట్ చాయిస్.
అదే.. జియోమీ ఎంఐ 11టీ. ఇప్పటికే మార్కెట్లోకి ఎంఐ 11 సిరీస్ను జియోమీ ఇండియా మార్కెట్లోకి కూడా తీసుకొచ్చింది. తాజాగా.. మరిన్ని సరికొత్త ఫీచర్లతో జియోమీ ఎంఐ 11టీ సిరీస్ను తీసుకురానుంది.
జియోమీ సెప్టెంబర్ 15న ఓ ఈవెంట్ను నిర్వహించనుంది. ఆ ఈవెంట్లోనే ఎంఐ 11టీ మోడల్ స్మార్ట్ఫోన్తో పాటు ఎంఐ పాడ్ 5 సిరీస్ను కూడా రిలీజ్ చేయనుంది.
ఎంఐ 11టీ ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్వోసీ ప్రాసెసర్, 64 ఎంపీ రేర్ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 3 * టెలీమాక్రో సెన్సార్, 120 హెచ్జెడ్ డిస్ప్లే లాంటి హైఎండ్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. అయితే.. ఎంఐ 11టీకి సంబంధించిన మిగతా ఫీచర్లను జియోమీ విడుదల చేయలేదు. లాంచ్ ఈవెంట్లోనే ఎంఐ11టీ ఫీచర్లను రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని ధర కూడా ఎంఐ 11 కంటే ఎక్కువే ఉండనుంది. ఎంఐ 11 సిరీస్లో 20 వేల నుంచి 70 వేల రూపాయల రేంజ్లో మోడల్స్ ఉన్నాయి.