న్యూఢిల్లీ : పలు లీకులు, రూమర్ల అనంతరం షియోమి ఎట్టకేలకు మార్కెట్లో ప్యాడ్ 6ను (Xiaomi Pad 6) లాంఛ్ చేసింది. ప్యాడ్ 5 అనంతరం రెండవ ప్రోడక్టివ్ ట్యాబ్లెట్గా ప్యాడ్ 6ను షియోమి ప్రవేశపెట్టింది. స్నాప్డ్రాగన్ 870తో పాటు స్మార్ట్ పెన్, కీబోర్డ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ దేశీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
6జీబీ, 8జీబీ వేరియంట్స్తో పాటు 128, 256జీబీ వేరియంట్స్లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది. చైనాలో షియోమి ప్యాడ్ 6తో పాటు ప్యాడ్ 6 ప్రొ లాంఛ్ చేయగా భారత్లో మాత్రం ప్రొ వెర్షన్ను లాంఛ్ చేయలేదు. ఇక షియోమి ప్యాడ్ 6 6జీబీ+128జీబీ వేరియంట్ రూ. 26,999కి అందుబాటులో ఉండగా, 8జీబీ+456జీబీ వేరియంట్ రూ. 28,999కి లభిస్తోంది.
ఐసీఐసిఐ బ్యాంక్ కార్డుపై రూ. 3000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక యాక్సెసరీస్ విషయానికి వస్తే కీ బోర్డు రూ. 4999 కాగా, స్మార్ట్ పెన్ రూ. 5999, కేస్ రూ 1499కి లభిస్తుంది. షియోమి ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే షార్ప్ డిటైల్స్తో కూడిన హై క్వాలిటీ ఇమేజ్లను డిస్ప్లే చేసే 11 ఇంచ్ స్క్రీన్, పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 870తో డివైజ్ స్మూత్గా వేగంగా రన్ అవుతుంది. యాప్స్, ఫోటోలు, వీడియోలను స్టోర్ చేసుకునేందుకు మెరుగైన మెమరీ, స్టోరేజ్ స్పేస్ను కలిగిఉంది. షియోమి ప్యాడ్ 6 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14పై రన్ అవుతుంది.
Read More :