న్యూఢిల్లీ : షియామి ఎట్టకేలకు తన ఫ్లాగ్షిప్ ఫోన్ లాంఛ్ డేట్ను ప్రకటించింది. జులై 5న షియామి 12ఎస్, షియాస్ 12ఎస్ ప్రొ స్మార్ట్ఫోన్లతో పాటు షియామి 12 అల్ట్రాను లాంఛ్ చేయనుంది. వీబోలో లాంఛ్ ఈవెంట్కు సంబంధించి కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
యూజర్లకు మెరుగైన ఫోటోగ్రఫీ అనుభూతిని అందించేందుకు న్యూ స్మార్ట్ఫోన్లు లీకా-సపోర్టెడ్ కెమెరాలతో కస్టమర్ల ముందుకు రానున్నాయని ఇప్పటికే కంపెనీ టీజర్లలో వెల్లడించింది. స్మార్ట్ఫోన్ స్సెసిఫికేషన్ల గురించి మాత్రం షియామి ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. ఇక షియామి 12 అల్ట్రా క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్తో రానుందని భావిస్తున్నారు.
రెండు ఇతర మోడల్స్ కూడా అదే చిప్ను కలిగిఉంటాయని అంచనా. లీక్లను బట్టి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీతో మరో షియామి 12 ప్రొ మోడల్ లాంఛ్ కానుందని భావిస్తున్నారు. ఇక భారత్లో షియామి 12ఎస్ సిరీస్, షియామి 12 అల్ట్రా లాంఛ్ వివరాల గురించి కంపెనీ ఇంతవరకూ నిర్ధిష్టంగా వెల్లడించలేదు.