న్యూఢిల్లీ : భారత్లో ఇటీవల X70 సిరీస్ను లాంఛ్ చేసిన వివో తదుపరి X80 స్మార్ట్ఫోన్ సిరీస్ లాంఛ్కు సన్నద్ధమవుతోంది. 2022 ఫిబ్రవరిలో X80 సిరీస్ను వివో భారత్లో లాంఛ్ చేయవచ్చని 91మొబైల్స్ తాజా నివేదిక వెల్లడించింది. భారత్లో ఈ సిరీస్లో కేవలం రెండు స్మార్ట్ఫోన్లు వివో X80 ప్రొ, X80 ప్రొ+లను లాంఛ్ చేస్తుందని ఈ నివేదిక పేర్కొంది.
వివో X80 సిరీస్ స్మార్ట్పోన్లు ఆండ్రాయిడ్ 11 ఓఎస్పై రన్ అవుతాయని, వెనిల్లా మోడల్ 120హెచ్జడ్ ఫుల్హెచ్డీ డిస్ప్లేతో 4-నానోమీటర్ డైమెన్సిటీ 2000 చిప్సెట్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుందని తాజా లీక్లు వెల్లడించాయి.