న్యూఢిల్లీ : భారత్లో వివో వీ27 సిరీస్ (Vivo V27)ను త్వరలో లాంఛ్ చేసేందుకు వివో సన్నాహాలు చేపట్టింది. లేటెస్ట్ వివో ఫోన్ టీజర్ను ఫ్లిప్కార్ట్లో పోస్ట్ చేశారు. వివో వీ27 సిరీస్లో భాగంగా వివో వీ27, వీ27ప్రొను కంపెనీ లాంఛ్ చేయనుంది. అధికారిక లాంఛ్ ఈవెంట్కు ముందు లేటెస్ట్ 5జీ ఫోన్ డిజైన్తో పాటు కొన్ని ఫీచర్లనూ కంపెనీ వెల్లడించింది.
వి సిరీస్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు ఈ సిరీస్లో ఇతర ఫోన్లతో పోలిస్తే ఖరీదైనవిగా చెబుతున్నారు. వివో వీ27 సిరీస్లో 5జీ ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకట్టుకోనుంది. రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్లో సెన్సర్లను అమర్చారు. వివో లేటెస్ట్ డివైజ్లు స్లిమ్, లైట్వెయిట్ డిజైన్తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. పంచ్ హోల్ డిజైన్తో ముందు భాగంలో కర్వ్డ్ డిస్ప్లే కనిపిస్తుంది.
వివో ఫోన్లలో మెరుగైన కెమెరా ఫీచర్లు ప్రత్యేకత కావడంతో వివో వీ27 సిరీస్లోనూ ఈ ఫీచర్ ఆకట్టుకునేలా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్లు మెరుగైన పోర్ట్రయిట్ షాట్స్ ఆఫర్ చేస్తాయని టీజర్లో వెల్లడైంది. వివో వీ27 సిరీస్ ఫోన్లు గ్రేడియంట్ ఫినిష్లతో ఆకట్టుకోనున్నాయి. వివో వీ27 ప్రొ రూ. 42,000కు అందుబాటులో ఉంటుందని అంచనా. అయితే లాంఛ్ ధర రూ. 40,000లోపు ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.