న్యూఢిల్లీ : భారత్లో వివో త్వరలో టీ సిరీస్ స్మార్ట్ఫోన్స్ విభాగంలో రెండు కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో టీ1 5జీకి కొనసాగింపుగా రానున్న ఈ రెండు స్మార్ట్ఫోన్లను వివో మేలో లాంఛ్ చేయనుంది. తాజా ఫోన్లతో వివో టీ సిరీస్ ఫోన్ల సంఖ్య మూడుకు పెరగనుంది.
ఫాస్ట్ చార్జింగ్ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానున్న న్యూ వివో ఫోన్లు రూ 25,000 లోపు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. న్యూ వివో స్మార్ట్ఫోన్లు వివో టీఐ 5జీ ఫీచర్లకు అదనంగా మరికొన్ని పీచర్లను జోడించవచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వివో టీ1 5జీ 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2.5డీ కర్వ్డ్ ఎడ్జ్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ వంటి ఫీచర్లను కలిగిఉంది.
ఇక క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్, ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటి ఫీచర్లను నూతన వివో స్మార్ట్ఫోన్లలో జోడించడంతో పాటు వివో టీ సిరీస్ ఫోన్లు అప్గ్రేడెడ్ కెమెరా సెటప్తో కస్టమర్ల ముందుకొస్తాయని భావిస్తున్నారు.