ByteDance | షార్ట్ వీడియో టిక్టాక్ మాతృసంస్థ.. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ సైతం ఉద్యోగుల ఉద్వాసన చేపట్టనున్నట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని వివిధ డిపార్ట్మెంట్లలో వందల మందిని ఇంటికి పంపాలని యోచిస్తున్నట్లు బైట్డ్యాన్స్ వర్గాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో వార్తా కథనం ప్రచురితమైంది. చైనీస్ మీడియా సంస్థ జీమెయిన్లో తొలుత బైట్డ్యాన్స్ ఉద్యోగుల ఉద్వాసన వార్త వచ్చింది.
చైనా వర్షన్ టిక్టాక్ డౌయిన్ ఉద్యోగులపైనా ప్రబావం పడుతున్నదని సమాచారం. డౌయిన్కు 600 మిలియన్ల డెయిలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టిక్టాక్తో జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది బైట్డ్యాన్స్ కీలకం కానున్నది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్, టెన్సెంట్ హోల్డింగ్స్లతోపాటు పలు చైనా ఇంటర్నెట్ జెయింట్ సంస్థలు గతేడాది వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి.
ఇదిలా ఉంటే, ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ సైతం తమ సంస్థలోని వివిధ శాఖల్లో ఐదు శాతం మందిని తొలగించాలని రెండు నెలల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగులు బైజూస్లో పని చేస్తున్నారు. దీని ప్రకారం 2,500 మందిని బైజూస్ వదిలించుకోనున్నది.