నగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. ఇలాంటి వాతావరణంలోనూ జీహెచ్ఎంసీ పరిధి లో ఆర్టీసీ బస్సుల కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు సిటీ బస్సులను యధావిధిగా నడుపుతున్నారు. బస్సులలో ప్రయాణాలు చేసే వారి నుంచి కరోనా ముప్పు పొంచి ఉన్నప్పటికీ మనో ధైర్యంతో సిటీ బస్సులను నడుపుతున్నారు. ప్రజల యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికార యంత్రాంగం బస్సు సేవలను అం దుబాటులోకి తీసుకొచ్చింది. అందుకోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా సహకరిస్తున్నారు. ప్రతి రోజూ తమ విధులకు హాజరవుతున్నారు.
కరోనా వైరస్ సోకుతుందన్న భయం లేకుండా విధులకు హాజరవుతూ ప్రయాణికుల ప్రయోజనాలు కాపాడుతున్నారు. తమ విధి నిర్వహణలో డ్రైవర్లు, కండక్టర్లు తమ కుటుంబాల కోసం, ఎంతో రిస్కు తీసుకుని విధులకు హాజరవుతున్నారని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు వారిని అభినందిస్తున్నా రు. అయితే, కరోనా నేపథ్యంలో ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరంలో బస్సులను నడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ను నియంత్రించానికి రాత్రిపూట కర్వ్యూను కొనసాగిస్తున్నామన్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు బస్సులను నగర రోడ్లపైకి రాకుండా ప్రభుత్వ ఆదేశాలకు తలొ గ్గి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఉదయం ఆరు గంటల నుంచి బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయని, తిరిగి రాత్రి తొమ్మిది గంటలలోపే డిపోలకు చేరుకుంటున్నాయన్నారు. ఈ క్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు రాత్రి తొమ్మిది గంటల లోపు తమ ఇండ్లకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అదే క్ర మంలో మహిళా కండక్టర్లు కూడా ఎంతో రిస్కు తీసుకుని విధులకు హాజరుకావడం పట్ల అధికారు లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, ఆర్టీసీ జీ హెచ్ఎంసీ జోన్ పరిధిలో దాదాపు 2,600 సిటీ బ స్సులు నడుస్తున్నాయి. వా టిలో 16 వేల మంది డ్రైవ ర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారి లో మహిళలు 1,600 వరకు కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జీ హెచ్ఎంసీ జోన్ ఈడీ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు.