న్యూఢిల్లీ : భారత్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి రావడంతో కస్టమర్లు 5జీ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 5జీ ఫోన్ అనగానే ఖరీదైన ఫోన్ అని కస్టమర్లు భావిస్తుండగా అందుబాటు ధరలోనూ పలు బ్రాండెడ్ 5జీ స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి.
తొలుత హైఎండ్, మిడ్ సెగ్మెంట్ టార్గెట్గా 5జీ ఫోన్లు లాంఛ్ అవగా తాజాగా అందుబాటు ధరల్లోనూ లోబడ్జెట్ 5జీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. హాట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చవకగా 5జీ ఫోన్లు మార్కెట్లో వెల్లువెత్తడం వినియోగదారులకూ లాభించే విషయమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
భారీ డిస్ప్లే, మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లేటెస్ట్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్స్కు చెందిన 5జీ ఫోన్లు లభ్యమవుతున్నాయి. రూ . 15,000లోపు మెరుగైన 5జీ ఫోన్ల కోసం చూసే వారు ఈ స్మార్ట్ఫోన్లను పరిశీలించవచ్చు.
మోటో జీ51 5జీ : రూ . 12,249
పోకో ఎం4 5జీ : రూ . 13319
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ : రూ.12,999
రెడ్మి 11 ప్రైమ్ 5జీ : రూ . 12,999
ఒప్పో ఏ74 5జీ : రూ. 14,990