Smart Phone Discounts | స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు ఆకర్షణీయ ఫీచర్లు, ఆప్షన్లతో సరికొత్త మోడల్ ఫోన్లు ఆవిష్కరిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ పట్ల ఆసక్తి ఉన్నా.. పెరుగుతున్న ధరలతో వాటి కొనుగోలు విషయంలో వెనుకంజ వేస్తున్నారు. అటువంటి స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం ఐదు స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చాయి. మీరు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కావాలని భావిస్తున్నారా.. అటువంటి వారి కోసం వన్ ప్లస్ మొదలు షియోమీ.. మోటరోలా వరకు ఆయా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. అందుబాటు ధరలో అవి లభ్యం అవుతున్నాయి.. అవేంటో ఓ లుక్కేద్దామా..!
గతేడాది మే నాలుగో తేదీన భారత్ మార్కెట్లోకి వన్ప్లస్ 10ఆర్ ఫోన్ వచ్చేసింది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈఫోన్పై రూ.7000 నుంచి రూ.11,991 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.7000 డిస్కౌంట్తో రూ.31,999, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్పై రూ.11,991 రాయితీతో రూ.35,999లకు లభిస్తుంది. అదే టైంలో 12జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.7000 డిస్కౌంట్తో రూ.36,999లకు లభిస్తుంది.
ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్లో వన్ప్లస్ 10ఆర్ ఫోన్ గరిష్ట ధర రూ.43,999పై క్యాష్ డిస్కౌంట్ రూ.8000 తో రూ.35,999లకు కొనుగోలు చేయొచ్చు. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేసిన వారికి రూ.1500 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.25 వేల వరకు ఆదా చేయొచ్చు. రూ.43,999 గరిష్ట ధర కాగా, 57 శాతం డిస్కౌంట్తో రూ.18,999లకే పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మార్పిడి చేస్తున్న పాత ఫోన్ కండీషన్ను బట్టి ఆఫర్ విలువ గణిస్తారు.
చైనా స్మార్ట్ ఫోన్ జెయింట్ షియోమీ 8జీబీ రామ్ ఫ్లస్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.27 వేల డిస్కౌంట్తో రూ.52,999లకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5000 ఇన్స్టంట్ డిస్కౌంట్తో రూ.47,999లకు సొంతం చేసుకోవచ్చు. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.28 వేల డిస్కౌంట్తో రూ.56,999లకు కొనుగోలు చేయొచ్చు.
2021 సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చిన షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్ రెండు వేరయంట్లలో లభ్యం అవుతుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్పై రూ.5000 డిస్కౌంట్తో రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్లో రూ.21,999లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఇక 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.8000 డిస్కౌంట్తో రూ.25,999లకే సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ మోటరోలా గతేడాది మే 12న ఆవిష్కరించిన మోటో ఎడ్జ్ 30 ఫోన్ రూ.8000 డిస్కౌంట్తో ఫ్లిప్కార్ట్లో రూ.22,999లకే అందుబాటులో ఉంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.10 వేల రాయితీతో రూ.24,999లకు లభ్యం అవుతుంది. అదనంగా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు.
మోటరోలాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ మోటో జీ72 ఫోన్ గతేడాది అక్టోబర్లో మార్కెట్లోకి విడుదల చేశారు. దీని లాంచింగ్ ధర రూ.21,999 కాగా, ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.7,000 డిస్కౌంట్తో రూ.14,999లకు అందుబాటులో ఉంది. మీడియా టెక్ హెలియో జీ99 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 108 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.