న్యూఢిల్లీ : యాపిల్ నెక్ట్స్ జనరేషన్ డివైజ్ ఐఫోన్ 15 మూడు భారీ మార్పులతో 2023లో కస్టమర్ల ముందుకు రానుంది. కీలక మార్పులను పలువురు స్వాగతిస్తుండగా మరికొందరు సెక్యూరిటీ కారణాలతో పెదవివిరుస్తున్నారు. ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్తో రానుంది. లైట్నింగ్ పోర్ట్ను ఇప్పటివరకూ ఐఫోన్లు ఆఫర్ చేస్తుండగా ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ను ఆఫర్ చేయడం భారీ మార్పుగా చెబుతున్నారు.
2024 నాటికి అన్ని ఫోన్లు విధిగా యూఎస్బీ టైప్-సీ పోర్ట్ను కలిగిఉండాలని యూరోపియన్ చట్టాలు పేర్కొనడంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఐఓఎస్ యూజర్లను థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకునేందుకు యాపిల్ అనుమతిస్తోంది. దీంతో అండ్రాయిడ్ యూజర్ల ఎప్పటినుంచో ఆస్వాదిస్తున్న వెసులుబాటు యాపిల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇక మరో భారీ అప్డేట్, కీలక మార్పు విషయానికి వస్తే ఐఫోన్ 15 ప్రొ వేరియంట్లు ఐఫోన్ 14 ప్రొ మోడల్స్లో కనిపించిన న్యూ డైనమిక్ ఐలండ్ ఫీచర్తో రానున్నాయి. స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్ కూడా ఈ ఫీచర్తో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. దీంతో పలు అండ్రాయిడ్ ఫోన్లలో చూస్తున్న టిపికల్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్తో నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్స్ రానున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.