న్యూఢిల్లీ : ఫోల్డబుల్ ఫోన్పై చాలాకాలంగా గూగుల్ కసరత్తు సాగిస్తుండగా పిక్సెల్ ట్యాబ్లెట్తో పాటు వచ్చే ఏడాది ఈ ఫోన్ను లాంఛ్ చేసేందుకు సెర్చింజన్ దిగ్గజం సన్నాహాలు ముమ్మరం చేసింది. పిక్సెల్ 7 లాంఛ్ అనంతరం తాజాగా గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ వివరాలు ఆన్లైన్లో వెల్లడయ్యాయి. పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ డ్యూయల్ డిస్ప్లేలను శాంసంగ్ తయారుచేస్తోందని లేటెస్ట్ రిపోర్ట్స్ తెలిపాయి.
పిక్సెల్ ఫోల్డ్ స్క్రీన్ సైజ్, రిఫ్రెష్ రేట్ వివరాలను 91మొబైల్స్ రిపోర్ట్ పేర్కొంది. ఇన్నర్ డిస్ప్లే 7.58 ఇంచెస్ ఉంటుందని 120హెచ్జడ్ స్ర్కీన్ రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుందని వెల్లడించింది. ఇన్నర్ డిస్ప్లే 1840×2208 పిక్సెల్స్ రిజల్యూషన్ సపోర్ట్తో రానుంది. వచ్చే ఏడాది పిక్సెల్ ఫోల్డ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేలా గూగుల్ సన్నద్ధమవుతోందని తెలిసింది. ఫోల్డబుల్స్ మార్కెట్లో శాంసంగ్ ఎప్పటినుంచో తనదైన ముద్ర వేయగా గూగుల్ ఈ సెగ్మెంట్లో తీవ్ర పోటీని ఎదుర్కోనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
దక్షిణ కొరియా తయారీ దిగ్గజం శాంసంగ్ ఇటీవల గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4ను లాంఛ్ చేయగా షియోమి, వివో తదితర కంపెనీలు కూడా ఫోల్డబుల్స్లో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాయి. మరోవైపు యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్తో కస్టమర్ల ముందుకొచ్చేందుకు కసరత్తు సాగిస్తోంది. ఇక పిక్సెల్ ఫోల్డ్తో శాంసంగ్కు దీటైన పోటీ ఇచ్చేందుకు గూగుల్ శ్రమిస్తోంది.