న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నెమ్మదించడంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు క్రమంగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తుండగా ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) సైతం తమ ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రావాలని కోరుతోంది. నెలకు 12 రోజుల పాటు ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరుతుండగా పలువురు ఉద్యోగులు స్వస్ధల్లాలో ఉండటం, కొత్త ప్రదేశాల నుంచి పనిచేస్తుండటంతో రిటన్ టూ ఆఫీస్ పాలసీకి అడ్జస్ట్ అవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆఫీసులకు విధిగా రావాల్సిందేనని టీసీఎస్ పట్టుబట్టడంతో పలువురు మహిళా ఉద్యోగులు కంపెనీ నుంచి వైదొలిగారు. కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగులు సైతం రిటన్ టూ ఆఫీస్ పాలసీపై పెదవివిరుస్తున్నారు. కార్యాలయాల నుంచి పనిచేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులకు వచ్చి వెళ్లడంతో చాలా సమయం వృధా అవుతోందని, ఈ క్రమంలో ఉత్పాదకత దెబ్బతింటోందని ఉద్యోగులు వాపోతున్నారు.
ప్రయాణ సమయంలో కార్యాలయంలోనే ఏదో కోర్సును అభ్యసించే అవకాశం ఉంటుందని వారు చెప్పుకొచ్చారు.మధ్య స్ధాయి ఉద్యోగుల సగటు అధ్యయన గంటలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 50 నుంచి 40కి తగ్గాయని టీసీఎస్ ప్రచురించిన వార్షిక నివేదిక వెల్లడించింది. మధ్యస్ధాయి టీసీఎస్ ఉద్యోగుల్లో ట్రైనింగ్ ప్రోగ్రాంకు హాజరైన వారిలో కేవలం 60 శాతం మందే ఉత్తీర్ణులై సంబంధిత మార్కెట్ టెక్నాలజీస్లో సర్టిఫికెట్ పొందారని ఈ నివేదిక తెలిపింది.
Read More :
Google | మేం స్కూల్ పిల్లలం కాదు : గూగుల్పై ఉద్యోగుల అసహనం