న్యూఢిల్లీ : హోసూర్లో తన ఐఫోన్ కేసింగ్ తయారీ ప్లాంట్ (IPhone Cases) విస్తరణకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుత ప్లాంట్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు కసర్తు సాగిస్తోంది. 500 ఎకరాల్లో 15,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం ఈ ప్లాంట్లో పనిచేస్తుండగా ఉద్యోగుల సంఖ్యను 25,000 నుంచి 28,000 వరకూ పెంచేందుకు సన్నద్ధమైంది.
నూతనంగా సమీకరించిన ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ సామర్ధ్యాన్ని వినియోగించుకుంటూ హైఎండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సామర్ధ్యాల విస్తరణకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. న్యూ ప్లాంట్ ప్రధానంగా యాపిల్ ఫోన్ పరికరాలను తయారుచేసినా ఇతర కంపెనీలకు హైఎండ్ ఫోన్స్ తయారుచేసే సామర్ధ్యం ఈ ప్లాంట్కు ఉండటంతో వైవిధ్య అవకాశాలను అందుకునేందుకు టాటా ఎలక్ట్రానిక్స్కు వెసులుబాటు కల్పిస్తుంది.
కర్నాటకలోని కోలార్ జిల్లాలో విస్ట్రన్ ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న క్రమంలో తయారీ సామర్ధ్యం విస్తరణ, ఉద్యోగుల నియామకానికి సంబంధించి టాటా గ్రూప్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More :