మనదేశంలో ఎప్పుడు రాకెట్ ప్రయోగం జరిగినా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) గుర్తుకొస్తుంది ఎవరికైనా. అలాంటిది మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అంతరిక్షంలోకి రాకెట్ని పంపనుంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్కోప్’ ఈ రాకెట్ని తయారుచేసింది. ఈ రాకెట్ పేరు ‘విక్రమ్-ఎస్’. నవంబర్ 12 నుంచి 16వ తేదీ మధ్యలో ఈ రాకెట్ని ప్రయోగించనున్నట్టు స్కైరూట్ సంస్థ తెలిపింది. అంతరిక్షంలో తమ కంపెనీ మొదటి అడుగుకు గుర్తుగా ఈ మిషన్కి ‘ప్రారంభ’ అనే పేరు పెట్టింది ఈ కంపెనీ. అయితే, 12 నుంచి 16వ తేదీలో ఏరోజు రాకెట్ లాంఛింగ్ చేయాలనేది వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందన తెలిపారు. శ్రీహరికోటలోని ఇస్రో లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ని ప్రయోగించనుంది స్కైరూట్.
‘మా తొలి అంతరిక్ష మిషన్ ప్రారంభను మొదలుపెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, మనదేశంలో ప్రైవేట్ స్పేస్ కంపెనీ రాకెట్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. నవంబర్ 12, 16 తేదీల్లో రాకెట్ని లాంఛ్ చేయనున్నాం. మా మిషన్ లోగోని ఆవిష్కరించినందుకు ఇస్రో ఛైర్మన్కు ధన్యవాదాలు. మాకు అన్నివిధాలా సహకరించినందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్కి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసింది స్కైలార్ కంపెనీ. ఈమధ్య స్టార్టప్ కంపెనీలు అన్ని రంగాల్లో కొ్త్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి.