న్యూఢిల్లీ : శాంసంగ్ తన లేటెస్ట్ నెక్ట్స్ జనరేషన్ గెలాక్సీ ఎస్23 సిరీస్ను ఫిబ్రవరి 1న లాంఛ్ చేయనుంది. తొలి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ను ఫిబ్రవరి 1న శాంసంగ్ నిర్వహించనుండటంతో ఇదే రోజున గెలాక్సీ ఎస్23 సిరీస్ను కంపెనీ లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ ఎస్23 సిరీస్ కింద శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్స్ను శాంసంగ్ ప్రవేశపెట్టనుంది.
ఈ ఈవెంట్లో గెలాక్సీ ఎస్23 సిరీస్ లాంఛ్ను శాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గెలాక్సీ ఎస్23 సిరీస్లో మూడు స్మార్ట్ఫోన్లు క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్తో రానుండగా ఎంపిక చేసిన మార్కెట్లలో న్యూ చిప్సెట్తో లేటెస్ట్ సిరీస్ను అందించేందుకు శాంసంగ్ కసరత్తు సాగిస్తోంది. లేటెస్ట్ లీక్స్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా యూనిబాడీ డిజైన్తో ఆకట్టుకోనున్నాయి.
ఇక న్యూ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ఫోన్లు మోడల్ను బట్టి స్క్రీన్, బ్యాటరీ సైజుల్లో భిన్నంగా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. గెలాక్సీ ఎస్23 అల్ట్రా మెరుగైన డిస్ప్లే, బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఇక లేటెస్ట్ సిరీస్లో శాంసంగ్ అమోల్డ్ ఈ6 డిస్ప్లేను వాడుతుందని, అల్ట్రా మోడల్లో 200 ఎంపీ కెమెరా సెన్సర్ ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ధర విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర రూ .70,000 నుంచి ప్రారంభమవుతుందని, అల్ట్రా మోడల్ ధర రూ . లక్షకు పైగా ఉంటుందని అంచనా.