Samsung Galaxy M33 5G | సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్లో ఎం33 5జీ ఫోన్ త్వరలో భారత్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ పవర్ఫుల్ ఫీచర్లతో భారత్లో విడుదల కానుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ను ఇటీవలే సామ్సంగ్ లాంచ్ చేసింది. వచ్చే వారం ఇండియాలో రిలీజ్ చేసేందుకు సామ్సంగ్ సన్నాహాలు చేస్తోంది.
6.6 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, ఎక్సినోస్ 1280 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 50 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్లో లాంచ్ కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ23, ఎం23 5జీ ఫోన్లలో ఉన్న ఫీచర్లే ఇందులోనూ ఉన్నాయి. అయితే.. వచ్చే వారం ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ్ కానుందే డేట్ను సామ్సంగ్ వెల్లడించలేదు.
సామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఫోన్.. ఆండ్రాయిడ్ 12 ఆధారిత యూఐ 4.1 ఓఎస్, 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ ఎక్సినోస్ 1280 ఎస్వోసీ, క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో, డెప్త్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ లాంటి పీచర్లతో విడుదల కానుంది.