న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో ఎంట్రీ లెవెల్ శాంసంగ్ గెలాక్సీ ఎం04 ఎంటరైంది. డీసెంట్ పీచర్లు, దీర్ఘకాల సాఫ్ట్వేర్ సపోర్ట్తో అందుబాటు ధరలో అనువైన ఫోన్ కోసం చూసేవారికి శాంసంగ్ గెలాక్సీ ఎం04 మేలైన ఎంపిక. ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 8000కే అందుబాటులో ఉంది.
ఈ ఫోన్కు రెండేండ్ల పాటు మేజర్ అండ్రాయిడ్ అప్గ్రేడ్స్ను శాంసంగ్ అందిస్తుంది. న్యూ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్పై రన్ అవుతుంది. రెండేండ్ల అండ్రాయిడ్ సపోర్ట్ అందించే క్రమంలో అండ్రాయిడ్ 14 ఓఎస్ అప్డేట్ను పొందుతుంది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, హెచ్డీ+ రిజల్యూషన్, వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్తో శాంసంగ్ గెలాక్సీ ఎం04 కస్టమర్ల ముందుకొచ్చింది.
ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ హెలియో పీ35 చిప్సెట్తో 4జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ను కలిగిఉంది. 15డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ఫోన్ డిసెంబర్ 16 నుంచి సేల్కు అందుబాటులో ఉంటుంది. మింట్ గ్రీన్, గోల్డ్ వైట్, బ్లూ సహా నాలుగు కలర్స్లో హ్యాండ్సెట్ లభిస్తుంది.