న్యూఢిల్లీ : భారత్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 అధికారికంగా లాంఛ్ అయింది. లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యాం, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో బేస్ మోడల్ రూ 11,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. 4జీ సపోర్ట్తో ముందుకొచ్చిన గెలాక్సీ ఎఫ్13 సేల్స్ జూన్ 29 నుంచి ఫ్లిప్కార్ట్, శాంసంగ్.కాం సహా రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటాయి.
128జీబీ స్టోరేజ్ మోడల్ రూ 12,999కు లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్పై రూ 1000 ఇన్స్టంట్ ఆఫర్ ప్రకటించింది. ఇక గెలాక్సీ ఎఫ్3 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..ఈ స్మార్ట్ఫోన్ 6.6 ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లేను కలిగిఉంది.
ఎక్సినాస్ 850 ప్రాసెసర్, 15డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, ఆటోడేటా స్విచింగ్, అడాప్టివ్ పవర్ సేవింగ్, ఏఐ పవర్ మేనేజ్మెంట్ వంటి హాట్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఆకట్టుకుంటుంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ వాటర్ఫాల్ బ్లూ, సన్రైజ్ కాపర్, నైట్ స్కై గ్రీన్ వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.