కొ్త్త వ్యాక్సిన్ కోసం, కొత్త ఔషధాల కోసం క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని చదివే ఉంటారు. కొత్తరం మందుల్ని, ల్యాబ్లో తయారుచేసిన అవయవాల్ని ముందుగా జంతువుల మీద, ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు పరిశోధకులు. ఈమధ్యే ల్యాబొరేటరీలో తయారుచేసిన రక్తాన్నిక్లినికల్ ట్రయల్లో భాగంగా ఇద్దరు మనుషులకి ఎక్కించారు లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఎర్రరక్తకణాల్ని ల్యాబోరేటరీలో పెంచి మనుషులకి ఎక్కించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ల్యాబరేటరీలో పెంచిన ఎర్రరక్తకణాల జీవితకాలం, దాతల నుంచి సేకరించిన ఎర్రరక్తకణాల కంటే ఎంత ఎక్కువ అనేది తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేశారు వీళ్లు. దాతల స్టెమ్ సెల్స్ నుంచి రక్తనాళాల్ని సేకరించి వాటిని ప్రయోగశాలలో పెంచారు. వాటిని తర్వాత ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల శరీరంలోకి ఎక్కించారు.
తక్కువ సార్లు రక్తమార్పిడి
‘రక్తదాతల నుంచి తీసుకున్న ఎర్ర రక్తకణాల కంటే మేము ల్యాబ్లో తయారుచేసిర ఎర్రరక్త కణాలు ఎక్కువ రోజులు మెరుగ్గా పనిచేస్తాయని నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మా క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే, తరచూ రక్తమార్పిడి అవసరమైన వాళ్లకు తక్కువ సార్లు రక్తమార్పి చేస్తే సరిపోతుంది’ అని చెప్పారు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సెడ్రిక్ గ్రెవెర్ట్.
వీళ్లకు వరం
రక్తసంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఈ కొత్తరకం రక్తకణాలు వరమని చెప్తున్నారు పరిశోధకులు. సికిల్ సెల్ అనీమియా వంటి సమస్య ఉన్నవాళ్లకు సమయానికి వాళ్ల గ్రూప్ రక్తం దొరకదు. దాంతో, ఈ రక్తకణాల్ని ఎక్కిస్తే, వాళ్ల ప్రాణాల్ని కాపాడొచ్చని చెప్తున్నారు పరిశోధకులు.