న్యూఢిల్లీ : భారత్లో జనవరి 5న రెడ్మి నోట్ 12 సిరీస్ లాంఛ్ కానుండగా రెడ్మి నోట్ 12, రెడ్మి నోట్ 12 ప్రొ, రెడ్మి నోట్ 12 ప్రొ ప్లస్ మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. ఇండియా లాంఛ్కు ముందు రెడ్మి చైనాలో రెడ్మి నోట్ 12 ప్రొ స్పెషల్ ఎడిషన్ను ప్రకటించింది. రెడ్మి నోట్ 12 స్పీడ్ ఎడిషన్ పేరుతో లేటెస్ట్ డివైజ్ను లాంఛ్ చేసింది.
హార్డ్వేర్, కలర్స్ మినహా నార్మల్ మోడల్నే రెడ్మి నోట్12 స్పీడ్ ఎడిషన్ పోలిఉంటుంది. రెడ్మి నోట్ 12 స్పీడ్ ఎడిషన్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 778జీ చిప్సెట్తో మిడ్నైట్ బ్లాక్, షిమ్మర్ గ్రీన్, టైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. రెడ్మి నోట్ 12 ప్రొ స్పీడ్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ రూ .20,200 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక రెడ్మి నోట్ 12 ప్రొ స్పీడ్ ఎడిషన్ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే, 100ఎంపీ మెయిన్కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 67డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. రెడ్మి నోట్ 12 ప్రొ స్పెషల్ ఎడిషన్ 5జీ కనెక్టివిటీతో పాటు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.