న్యూఢిల్లీ : రెడ్మి నోట్ 12 ప్రొ వచ్చే వారం దేశీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. లేటెస్ట్ సిరీస్లో భాగంగా రెడ్మి నోట్ 12, రెడ్మి నోట్ 12 ప్రొ, రెడ్మి నోట్ 12 ప్రొ ప్లస్ ఈనెల 5న లాంఛ్ కానున్నాయి. లాంఛ్కు ముందు రెడ్మి నోట్ 12 ప్రొకు సంబంధించి పలు వివరాలను కంపెనీ వెల్లడించింది. రెడ్మి నోట్ 12 ప్రొ కెమెరా వివరాలను నిర్ధారిస్తూ లేటెస్ట్ ఫోన్ నమూనా ఫొటోలను పోస్ట్ చేసింది.
రెడ్మి నోట్ 12తో తీసిన ఫొటోలు మెరుగైన క్వాలిటీని కలిగిఉన్నాయి. ఈ ఫోన్తో క్లిక్మనిపించిన ఫొటోలకు అదనపు ఎడిటింగ్, కలర్ కరెక్షన్ అవసరం లేదనే రీతిలో ఉన్నాయి. అప్కమింగ్ రెడ్మి నోట్ 12 ప్రొ 5జీ 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరాతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో కస్టమర్ల ముందుకు రానుంది. కొద్దివారాలుగా చైనాలో అందుబాటులో ఉన్న రెడ్మి నోట్ 12 ప్రొ ఫీచర్లు భారత వేరియంట్లోనూ ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
రెడ్మి నోట్ 12 ప్రొ 6.67 ఇంచ్ ఎఫ్హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లేతో స్టీరియో స్పీకర్స్ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్ఓసీ చిప్సెట్ను కలిగిఉంది. రెడ్మి నోట్ 12 ప్రొ అండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ 67 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది.